దుబాయ్​ వెళ్లి వచ్చినా పరిస్థితి మారకపోవడంతో....

విదేశాలకు వెళ్లిన యువకుడు సరైన ఉపాధి లేక తిరిగి వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది.

Update: 2024-09-11 13:59 GMT

దిశ, లోకేశ్వరం : విదేశాలకు వెళ్లిన యువకుడు సరైన ఉపాధి లేక తిరిగి వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది. ఏఎస్ఐ దిగంబర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పుస్పూర్ గ్రామానికి చెందిన కన్నం పోశెట్టి (32) గత మూడు సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లగా సరైన ఉపాధి లభించకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటి నుండి మృతునికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో మద్యానికి బానిసై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగగా జీవితంపై విరక్తి చెంది బుధవారం మధ్యాహ్నం పుష్పూరు గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. 

Tags:    

Similar News