పని కోసం వచ్చి...అంతలోనే...

ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-09-11 16:22 GMT

దిశ,చౌటుప్పల్ : ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చౌటుప్పల్ ఇన్​స్పెక్టర్ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ మారేడుపల్లి లోని నెహ్రూ నగర్ కాలనీకి చెందిన సునీత (28) మూడు సంవత్సరాల క్రితం అదే కాలనీకి చెందిన రవి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అనంతరం కొన్ని కారణాల వల్ల రవి నుండి విడిపోయి ఆరు నెలల క్రితం ఈస్ట్ మారేడుపల్లి, తుకారంగేటు గ్రామానికి చెందిన సాయికుమార్ ను వివాహం చేసుకుంది. ఇరువురు పని కోసం 20 రోజుల క్రితం చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు.

     బుధవారం ఉదయం భర్త సాయికుమార్ కూలి పనికి వెళ్తూ తన వెంట పనులకు రమ్మని పిలవగా తాను రానని ఇంట్లోనే ఉంది. భర్త ఉదయం కూలి పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి తపులు ఎంతసేపు కొట్టినా తెరవక పోవడంతో దానిని పగలగొట్టి చూడగా ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంది. వెంటనే చౌటుప్పల్ పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను పరిశీలిస్తున్నట్టు సీఐ మన్మథకుమార్ తెలిపారు.

Tags:    

Similar News