హుక్కా సెంటర్‌పై దాడి..ఇద్దరు అరెస్ట్

నిబంధనలకు విరుద్ధంగా గుట్టు చప్పుడు కాకుండా

Update: 2024-09-22 09:15 GMT

దిశ, ఎల్బీనగర్ : నిబంధనలకు విరుద్ధంగా గుట్టు చప్పుడు కాకుండా హుక్కా నడిపిస్తున్నారని సమాచారం మేరకు వనస్థలిపురం పోలీసులు దాడి చేశారు. అందులోని పరికరాలను ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే చింతలకుంట పరిధిలోని జాతీయ రహదారిపై ఉన్నటువంటి సుబ్బయ్య గారి హోటల్ పైన రిలాక్స్ సెంటర్ లో హుక్కు నిర్వహిస్తున్నారని సమాచారం.

ఈ మేరకు శనివారం సాయంత్రం వనస్థలిపురం సీఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై ప్రభాకర్ సిబ్బందితో దాడి చేసి హుక్కు కు సంబంధించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులైన మహమ్మద్ సోయాబుద్దీన్, సయ్యద్ సిరియాదు లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి వెల్లడించారు. గతంలో కూడా రెండు మూడు కేసులు ఉన్నాయని సీఐ పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా ఎవరు ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడిన ఉపేక్షించేది లేదని సీఐ అశోక్ రెడ్డి వెల్లడించారు.


Similar News