రోడ్డు దాటుతుండగా ప్రమాదం...వ్యక్తి మృతి

మండలంలోని గౌరారం రాజీవ్ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.

Update: 2024-08-21 16:23 GMT

దిశ, వర్గల్ : మండలంలోని గౌరారం రాజీవ్ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గజ్వెల్ గ్రామానికి చెందిన చిక్కుడు కిరణ్ (30) గౌరారం వద్ద ఉన్న సెవెన్ హిల్స్ హోటల్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి వచ్చాడు. హోటల్ సమీపంలో

     ఉన్న రోడ్డును కిరణ్ దాటుతుండగా ప్రజ్ఞపూర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్లే గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి చెందిన వ్యక్తి నర్సింలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా వాహనాన్ని గుర్తించే విధంగా దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News