కొత్తగూడెం కలెక్టరేట్ లో ఏసీబీ దాడి

కొత్తగూడెం కలెక్టరేట్లో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు.

Update: 2024-09-18 15:18 GMT

దిశ,కొత్తగూడెం : కొత్తగూడెం కలెక్టరేట్లో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. లంచం తీసుకుంటున్న అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రూ. లక్ష 14 వేలు లంచం తీసుకుంటున్న హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణను పట్టుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించిన సబ్సిడీ పొందేందుకు సర్టిఫై చేసేందుకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. సూర్యనారాయణని అదుపులోకి తీసుకున్న ఏసీబీ డీఎస్పీ రమేష్ దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News