రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి..

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Update: 2024-09-18 09:34 GMT

దిశ, ఉప్పల్ : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే నల్లకుంటకు చెందిన నీతా (35) తన పిల్లలను నాచారంలోని జాన్సన్ గ్రామర్ హై స్కూల్ పాఠశాలలో వదిలి తిరిగి ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలోనే నాచారం హెచ్ఎంటీ నగర్ వద్ద స్కూటీని లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో మహిళ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు లారీ డ్రైవర్ నరేష్ (32)ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


Similar News