నిజామాబాద్‌లో క్షుద్రపూజల కలకలం.. అర్ధరాత్రి స్మశానంలో మేకను బలిచ్చి..

నిజామాబాద్ జిల్లాలో మరోసారి క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. మక్లూర్‌లోని మాణిక్ బండార్ స్మశానంలో గురువారం అర్ధరాత్రి ఓ మాంత్రికుడు క్షుద్రపూజలు చేశాడు.

Update: 2023-12-15 06:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లాలో మరోసారి క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. మక్లూర్‌లోని మాణిక్ బండార్ స్మశానంలో గురువారం అర్ధరాత్రి ఓ మాంత్రికుడు క్షుద్రపూజలు చేశాడు. స్మశానంలో మేకను బలిచ్చి క్షుద్రపూజలు చేస్తుండంగా కొందరు గ్రామస్తులు గమనించారు. తీవ్ర ఆందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మాంత్రికుడిని పట్టుకుని దేహాశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. అర్ధరాత్రి వేళ స్మశానంలో క్షుద్రపూజలు చేస్తోన్న మాంత్రికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షుద్రపూజల కారణంగా నెల రోజుల్లో 8 మంది చనిపోయారని గ్రామస్తులు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Similar News