Kamareddy: ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి.. పోలీసులకు తండ్రి ఫిర్యాదు

కామారెడ్డి జిల్లా గాంధారిలోని పోతంగల్ కమాన్ వద్ద ప్రమాదవశాత్తు బానోత్ నరేష్ అనే వ్యక్తి మృతి చెందారు...

Update: 2023-12-01 07:52 GMT

దిశ, గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారిలోని పోతంగల్ కమాన్ వద్ద ప్రమాదవశాత్తు బానోత్ నరేష్ అనే వ్యక్తి మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై వెళ్తూ రాయిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ద్విచక్ర వాహనంపై కాటేవాడి తండాలో ఓటు వేసి వెళ్తుండగా పిట్లం వద్ద ప్రమాదం జరిగింది. అయితే అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఎలాంటి సూచీ బోర్డులు పెట్టకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మృతుడు తండ్రి బానోత్ శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.


Similar News