ఇప్పుడే వస్తానని వెళ్లిన వ్యక్తి.. చెరువులో శవమై తేలాడు

ఇంట్లో ఫోన్ చార్జింగ్ పెట్టి.. ఇప్పుడే వస్తానని భార్యతో చెప్పి బయటికి వెళ్లిన ఓ వ్యక్తి మూడు రోజుల తరువాత చెరువులో శవమై తేలిన సంఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో సోమవారం జరిగింది.

Update: 2023-12-18 15:54 GMT

దిశ, భిక్కనూరు : ఇంట్లో ఫోన్ చార్జింగ్ పెట్టి.. ఇప్పుడే వస్తానని భార్యతో చెప్పి బయటికి వెళ్లిన ఓ వ్యక్తి మూడు రోజుల తరువాత చెరువులో శవమై తేలిన సంఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన దేవన బోయిన గొల్ల నాగరాజు (42)వంటలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 15న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇప్పుడే వస్తానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళుతున్నాడని భార్య పద్మ ఆయన వెనకాలే వెళ్లి చూడగా, ఎవరో ద్విచక్ర వాహనం పై ఎక్కించుకొని వెళ్తున్నారని గమనించి తిరిగి ఇంటికి చేరుకుంది. వంటలు చేసేందుకు ఎవరైనా ఎక్కించుకొని వెళ్లారేమోనన్న ఉద్దేశంతో తెల్లవారుజామున భర్త రాక కోసం ఎదురుచూసింది.

మధ్యాహ్నం వరకు చూసిన రాకపోవడంతో ఆందోళనకు గురై బంధువులు స్నేహితుల ఇండ్లలో వెతికింది. అయినా ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఉదయం గ్రామంలోని పెద్ద చెరువులో ఒక మృతదేహం కనిపించిందని కుటుంబ సభ్యులకు సర్పంచ్ నర్సింలు యాదవ్ ఫోన్ చేసి సమాచారం అందించడంతో, కుటుంబ సభ్యులు వెంటనే చెరువు వద్దకు వెళ్లి చూడగా తనబర్తేనని గుర్తించి బోరున విలపించింది. అయితే నాగరాజు ఆరోజు అర్థ రాత్రో, లేక మరుసటి రోజు వేకువ జామునో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని, అందువల్లే మృతదేహం గుర్తుపట్టని విధంగా కుళ్ళిపోయిందని పోలీసులు పేర్కొన్నారు. నాగరాజు ఆత్మహత్యతో ఆ కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది. ఈ మేరకు కేసునమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ సాయి కుమార్ వివరించారు.

Tags:    

Similar News