కలకలం రేపిన యువకుని దారుణ హత్య

యువకుని దారుణ హత్య కలకలం రేపింది. మంగళవారం రాత్రి హత్యకు గురైన వ్యక్తి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన వనగండ్ల కిరణ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు.

Update: 2024-09-11 16:15 GMT

దిశ, తిరుమలగిరి : యువకుని దారుణ హత్య కలకలం రేపింది. మంగళవారం రాత్రి హత్యకు గురైన వ్యక్తి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన వనగండ్ల కిరణ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. కిరణ్ కుమార్ మరణ వార్తతో తిరుమలగిరి అంబేద్కర్ నగర్లో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. పాత కక్షల నేపథ్యంలో గొంతు కోసి దారుణంగా హత్య చేసి నాగారం మండలం డి.కొత్తపల్లి ఎస్ఆర్ఎస్పీ కాల్వ సమీపంలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.

     నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. నిందితుల కోసం ప్రత్యేక పోలీసులు బలగాలు రంగంలోకి దింపినట్టు సూర్యాపేట డీఎస్పి జి.రవి, సీఐ రఘువీర్ రెడ్డి, తిరుమలగిరి సబ్ ఇన్స్పెక్టర్ వి. సురేష్ తెలిపారు. మొదటగా తోపులాట జరిగిన, హత్య జరిగిన స్థలాలను డాగ్ స్క్వాడ్లతో పరిశీలించారు. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్టు పోలీసులు వివరించారు. 

Tags:    

Similar News