విషాదం.. మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

Update: 2024-08-02 02:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి నలుగురు మృతి చెందారు. చాగల మర్రి మండలం చిన్నవంగలిలో ఘటన జరిగింది. శిథిలాల కిందే చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన నలుగరు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో దంపతులు గురు శేఖర్ రెడ్డి, దస్తగిరమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను గ్రామస్తులు వెలికితీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News