తెలంగాణలో భారీగా కరోనా కేసులు

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. అయితే గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 965 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం… కరోనాతో ఐదుగురు మృతి చెందగా, అదే సమయంలో 312 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,09,741కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,01,876 మంది […]

Update: 2021-04-01 23:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. అయితే గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 965 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం… కరోనాతో ఐదుగురు మృతి చెందగా, అదే సమయంలో 312 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,09,741కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,01,876 మంది కోలుకోగా, మొత్తం మృతుల సంఖ్య 1, 706 కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 6,159 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,622 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్తగా 254 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News