ఏపీలో కొత్తగా 5,795 కరోనా కేసులు

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 65,889 మందికి పరీక్షలు నిర్వహించగా 5,795మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 7,29,307కు చేరింది. 33మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 6,052గా ఉంది. ప్రస్తుతం 50,776 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 6,72,479 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 6,046 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 62,16,240 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా మహమ్మారి […]

Update: 2020-10-06 07:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 65,889 మందికి పరీక్షలు నిర్వహించగా 5,795మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 7,29,307కు చేరింది. 33మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 6,052గా ఉంది. ప్రస్తుతం 50,776 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 6,72,479 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 6,046 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 62,16,240 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి భారిన పడి కృష్ణా జిల్లాలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ప్రకాశం జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, విశాఖ జిల్లాలో నలుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, కర్నూలులో ఒకరు, విజయనగరం జిల్లాల్లో ఒకరు చనిపోయారు.

అనంతపురంలో 209 పాజిటివ్ కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 970, తూర్పుగోదావరి జిల్లాలో 801, గుంటూరులో 441, కడపలో 434, కృష్ణా జిల్లాలో 482, కర్నూలులో 123, నెల్లూరులో 451, ప్రకాశంలో 580, శ్రీకాకుళంలో 142, విశాఖపట్నంలో 303, విజయనగరంలో 163, పశ్చిమగోదావరి జిల్లాలో 696 కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Tags:    

Similar News