తెలంగాణలో ఒక్కరోజే 546 కేసులు

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ క్రమేనా విజంభిస్తోంది. నిన్న ఒకటి తక్కువ 500 వందలకు చేరిన కరోనా కేసులు.. నేడు 5 వందల మార్క్‌ను అవలీలగా దాటేసింది. శనివారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ.. ఏకంగా 546 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 458 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కావడం రాజధాని వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాకుండా, వైరస్ కారణంగా ఒక్కరోజే 5గురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనాతో […]

Update: 2020-06-20 11:07 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ క్రమేనా విజంభిస్తోంది. నిన్న ఒకటి తక్కువ 500 వందలకు చేరిన కరోనా కేసులు.. నేడు 5 వందల మార్క్‌ను అవలీలగా దాటేసింది. శనివారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ.. ఏకంగా 546 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 458 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కావడం రాజధాని వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాకుండా, వైరస్ కారణంగా ఒక్కరోజే 5గురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 203కు చేరుకుంది. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 7,072 కు చేరుకుంది. వైరస్ నుంచి కోలుకొని 3,506 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 3,363 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు:

జీహెచ్ఎంసీ- 458
రంగారెడ్డి -50
కరీంనగర్ -13
జనగాం -10
మేడ్చల్ -6
మహబూబ్‌నగర్ -3
ఖమ్మం -2
వరంగల్ రూరల్ -2
వరంగల్ అర్బన్ -1
ఆదిలాబాద్ -1

Tags:    

Similar News