కొత్తగా247 కరోనా పాజిటివ్ కేసులు

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 60,527 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 247 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,769కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కొవిడ్‌తో ముగ్గురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1659కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న […]

Update: 2021-03-17 01:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 60,527 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 247 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,769కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కొవిడ్‌తో ముగ్గురు మృతిచెందారు.

దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1659కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 158 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,98,009కి చేరింది.రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,101 ఉండగా.. వీరిలో 716 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 29 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 93,59,772కి చేరింది.

‌‌‌‌‌‌‌‌.

Tags:    

Similar News