త‌మిళ‌నాడులో క‌రోనా విజృంభ‌ణ‌‌.. ఒక్క‌రోజే 21 మంది మృతి

చెన్నై : త‌మిళ‌నాడులో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే ఆ రాష్ర్టంలో క‌రోనాతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త‌గా 1685 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో త‌మిళ‌నాడులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 34,914కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ‌నాడులో 307 మంది మ‌ర‌ణించిన‌ట్లు ఆ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. ఈ వైర‌స్ నుంచి 18,325 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల్లో […]

Update: 2020-06-09 08:33 GMT

చెన్నై : త‌మిళ‌నాడులో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే ఆ రాష్ర్టంలో క‌రోనాతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త‌గా 1685 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో త‌మిళ‌నాడులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 34,914కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ‌నాడులో 307 మంది మ‌ర‌ణించిన‌ట్లు ఆ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. ఈ వైర‌స్ నుంచి 18,325 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల్లో మ‌హారాష్ర్ట మొద‌టిస్థానంలో ఉండ‌గా, త‌మిళ‌నాడు రెండో స్థానంలో నిలిచింది. మ‌హారాష్ర్ట‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 88,529కి చేరుకోగా, 3,169 మంది మృతి చెందారు.

Tags:    

Similar News