ఇందూర్లో సెంచరీ దాటిన కరోనా కేసులు
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కోవిడ్ 19 కేసుల సంఖ్య 101 కి చేరింది. తాజాగా గురువారం రెండు కరోనా కేసులు నమోదయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. దీంతో వారు ఇటీవల కాలంలో ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందూర్లో ప్రస్తుతం 26 యాక్టివ్ కేసులు ఉండగా 12 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. అన్లాక్ కాలంలోనే ఇందూర్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. నిజామాబాద్ మెడికల్ […]
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కోవిడ్ 19 కేసుల సంఖ్య 101 కి చేరింది. తాజాగా గురువారం రెండు కరోనా కేసులు నమోదయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. దీంతో వారు ఇటీవల కాలంలో ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందూర్లో ప్రస్తుతం 26 యాక్టివ్ కేసులు ఉండగా 12 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. అన్లాక్ కాలంలోనే ఇందూర్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. నిజామాబాద్ మెడికల్ కళాశాల అనుబంద జనరల్ ఆసుపత్రి( కోవిడ్ ఆసుపత్రి)లో కరోనా టెస్టులకు గురువారం ఐసీఎంఆర్ అనుమతినిచ్చింది.