యాచారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఒకరి మృతి..

by Sumithra |   ( Updated:2021-12-17 22:44:23.0  )
Accident
X

దిశ,యాచారం: యాచారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన యాచారం పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ పద్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు తెల్లవారుజాము సమయంలో సాగర్ రహదారిపై మాల్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వెనక నుంచి ఓ గుర్తుతెలియని వాహనం అతడిని ఢీ కొట్టి ఉండొచ్చని వారు తెలిపారు. మృతుని వివరాలు పూర్తిగా తెలియలేదని పద్మయ్య తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మరిన్ని వివరాల త్వరలోనే తెలుసుకుంటామని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed