ఐపీఎల్‌లో మరో భారీ స్కోర్ నమోదు చేసిన సన్‌రైజర్స్

by Disha Web Desk 12 |
ఐపీఎల్‌లో మరో భారీ స్కోర్ నమోదు చేసిన సన్‌రైజర్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సంచలనంగా మారింది. ఈ రోజు ఢిల్లీతో జరిగిన మ్యాచులో ఓపెనర్లు ట్రావిస్ హెడ్ 89, అభిషేక్ శర్మ 46, క్లాసిన్ 15, నితీష్ కుమార్ రెడ్డి 37, పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్ మొదట్లో ఆరు ఓవర్లలో 125 పరగులు చేసి చరిత్ర సృష్టించిన ఆరెంజ్ ఆర్మీ, మొదటి 10 ఓవర్లలో 156 పరుగులు చేసి మరో రికార్డును బ్రేక్ చేసింది. అనంతరం వెంట వెంటనే హెడ్, క్లాసిన్ అవుట్ కావడంతో స్కోరు కాస్త నెమ్మదించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష్, షాబాజ్ 50 పరుగుల బాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో షాబాజ్ అహ్మద్ 59* పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 266 పరుగులు చేసి.. ఐపీఎల్ చరిత్రలో మరో భారీ స్కోరును నమోదు చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలంటే 120 బంతులలో 267 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచులో ఢిల్లీ బౌలర్లు కుల్దీప్ ఒక్కడే నాలుగు వికెట్లు తీసుకోగా.. ముఖేష్, అక్షర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.



Next Story

Most Viewed