- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రికార్డులకు కేరాఫ్ అడ్రాస్గా మారిన సన్రైజర్స్.. సొంత రికార్డులు బ్రేక్
దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సంచలనంగా మారింది. ప్రతి మ్యాచుల్లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ క్రికెట్ అభిమానులను తమవైపు తిప్పుకుంటుంది. ఈ క్రమంలోనే నేడు ఢిల్లీతో జరిగిన మ్యాచులోను పలు రికార్డులను బ్రేక్ చేసింది. పవర్ ప్లేలోని మొదటి ఆరు ఓవర్లలో 125 పరుగులు చేసి రికార్డులను తిరగరాసింది. అలాగే మొదటి పది ఓవర్లలో అద్యదిక స్కోర్ చేసిన జట్టుగా కూడా సన్ రైజర్స్ జట్టు నిలిచింది. ఇదే సీజన్లో మొదటి పది ఓవర్లలో 148 పరుగులు చేసిన రికార్డును బ్రేక్ చేసిన హైదరాబాద్ తాజాగా మొదటి 10 ఓవర్లకు 156 పరుగులు చేసి సంచలనంగా మారింది. అలాగే ఈ మ్యాచులోనే ట్రావిస్ హెడ్ 16 బంతుల్లోనే 54 పరుగులు చేసి ఐపీఎల్ లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ రికార్డును సమం చేశాడు. అలాగే గత పది సంవత్సరాలుగా ఆర్సీబీ జట్టు పేరు మీద ఉన్న 263 పరుగుల హైఎస్ట్ టోటల్ రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా.. 277 , 287 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సీజన్ లో హైదరాబాద్ జట్టు ఊపు చూస్తుంటే.. ఇంకా మరిన్ని రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా.. సరికొత్త రికార్డులను నెలకొల్పే అవకాశం ఉంది.