రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి

by Sumithra |
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి
X

దిశ, భిక్కనూరు : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలను ఢీకొని ఒకరు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, మరో ఇద్దరు యువకులు గాయపడిన సంఘటన భిక్కనూరు మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన సిద్ధార్థ, కూర్ల భూపాల్ లు మండల కేంద్రం సమీపంలో ఉన్న ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో పని చేస్తారు. ఇద్దరు కలిసి బైక్ పై డ్యూటీ కి వెళ్తుండగా, విజయ గణపతి రైస్ సమీపంలో ఉన్న ప్రమాదకరంగా ఉన్న మూలమలుపు వద్ద, భిక్కనూరుకు చెందిన హాజీపూర్ అక్షయ్ బైక్ పై వారి తల్లిని ఫార్మా కంపెనీలో దించి వస్తుండగా ఎదురెదురుగా వస్తున్న బైకులు రెండు ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో భిక్కనూరుకు చెందిన అక్షయ్ తో పాటు, హెల్మెట్ పెట్టుకొని బైక్ నడుపుతున్న సిద్ధార్థలు గాయపడ్డారు. బైక్ వెనకాల కూర్చున్న భూపాల్(46) మాత్రం ఎగిరి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్లు రాణి, మేరీ, కుమారుడు దయాకర్ లు ఉన్నారు. ప్రమాదంలో గాయపడ్డ సిద్ధార్థ, అక్షయ్ లు కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు భిక్కనూరు ఏఎస్ఐ జగదీష్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed