వ్యక్తి దారుణ హత్య

by Disha Web Desk 15 |
వ్యక్తి దారుణ హత్య
X

దిశ,మేడ్చల్ టౌన్ : ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మండలం మురహరి పల్లి గ్రామానికి చెందిన లాకు (40) చత్తీస్గడ్ లక్ష్మీ దుర్గ శ్యామల వద్ద పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు. అక్కడే రాజు అనే వ్యక్తి కూడా పనిచేస్తూ ఉండేవాడు. గత మూడు రోజుల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం గ్రామంలోని లక్ష్మీ దుర్గ షాప్ ముందు ఉన్న షెటర్లలో ఎయిర్ కటింగ్ చేసుకొని నిద్రిస్తుండగా రాజు మినీ సిలిండర్ తో లాకు పై దాడి చేశాడు. దీంతో లాకు అక్కడికక్కడే మృతి చెందాడు. లాకు మృతి చెందాడని తెలుసుకున్న రాజు జీనమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతదేహాన్ని స్థానిక పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed