కారును ఢీ కొట్టిన లారీ.. స్టీరింగ్ విడిచి కిందికి దూకిన డ్రైవర్..

by Sumithra |
కారును ఢీ కొట్టిన లారీ.. స్టీరింగ్ విడిచి కిందికి దూకిన డ్రైవర్..
X

దిశ, భిక్కనూరు : ముందు వెళ్తున్న కారును వెనకాలే వస్తున్న లారీ ఢీ కొనడంతో భయపడిపోయి డ్రైవర్ కిందికి దూకేశాడు. దీంతో లారీ ముందుకు వెళ్లి బోల్తా పడిన సంఘటన భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ కు చెందిన ఒక న్యాయవాది హైదరాబాద్ వెళ్లి అక్కడ పనులు ముగించుకొని క్రెటా వాహనంలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేసి వెళుతుండగా దాని వెనకాలే వెదురు బొంగుల లోడుతో వెళ్తున్న లారీ ఢీ ఢీకొంది. ఈ ప్రమాదంతో భయపడిపోయిన లారీ డ్రైవర్ నడుస్తున్న లారీ స్టీరింగ్ వదిలి కిందికి దూకేశాడు. దీంతో లారీ కొద్ది ముందుకు పోయి హైవే రోడ్డు పక్కన బోల్తా పడింది. అయితే క్రెటా వాహనం నడుపుతున్న న్యాయవాది సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేయడం, రెండు బెలూన్లు ఒకసారి ఓపెన్ కావడం వలన ప్రాణాపాయం తప్పింది.

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న ప్లాజా సిబ్బంది ఒక్కసారిగా ఘటనా స్థలానికి పరుగులు తీశారు. లారీ క్యాబిన్ లో క్లీనర్ ఉండవచ్చన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్లి వెతకగా ఎవరూ కనిపించలేదు. కాగా క్రెటా వాహనం నడుపుతున్న న్యాయవాది ఓపెన్ అయిన బెలూన్లు ఒత్తినట్లు కావడంతో నొప్పి భరించలేక టెన్షన్ కు గురయ్యాడు. ఈ ఘటనలో క్రెటా వాహనం ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా నడి రోడ్డు పై ఉన్న వాహనాన్ని టోల్ ప్లాజా సిబ్బంది క్రేన్ సహాయంతో పక్కకు తీయించారు.

Next Story

Most Viewed