- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కల్లు తాగించి.. ఆ తర్వాత హత్య.. నిందితుడు అరెస్ట్
దిశ, దామరగిద్ద, నారాయణపేట క్రైమ్: ఓ మహిళకు కల్లు తాగించి శారీరకంగా లోబర్చుకొని, ఆ తర్వాత తిరిగి తనతో శారీరకంగా గడపాలని కోరడంతో నిరాకరించిన మహిళను హత్య చేశాడు. ఈ కేసును చేదించినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. ఓ వివాహిత మహిళను హత్య చేసిన ఘటనపై దామరగిద్ద పోలీసులు ఏప్రిల్ 26వ తేదీన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దామరగిద్ద మండలం నర్సాపూర్ కు చెందిన సవిత(40) మండల కేంద్రంలో తన భర్త తో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉండేవారని ఈమెను శారీరకంగా కల్లు తాగించి లోబరుచుకునే క్రమంలో నిరాకరించడంతో దామరగిద్ద కు చెందిన లక్ష్మప్ప గొడ్డలి కర్రతో నిద్రిస్తున్న సమయంలో సవిత తలపై కొట్టి హత్య చేసినట్లు తమ విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
నిందితుడు లక్ష్మప్ప భార్య 8 సంవత్సరాల క్రితం రొమ్ము క్యాన్సర్ తో చనిపోయిందని మేస్త్రి గా పనిచేసే లక్ష్మప్పకు కల్లు తాగే అలవాటు లో భాగంగా సవిత దామరగిద్ద మండల కేంద్రంలోని లక్ష్మీ నగర్ లోని నరసింహులు కళ్ళు దుకాణం వద్ద పరిచయమైందని తెలిపారు. హత్య చేసిన రెండు రోజులు లక్ష్మప్ప సంఘటన స్థలంలో లేడని స్థానికులు దుర్వాసన వస్తున్నట్లు గుర్తించి సమాచారం అందించినట్లు తెలిపారు. విచారణ చేయగా హత్యకు పాల్పడింది లక్ష్మప్ప అని గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. నిందితుడిని గుర్తించడంలో కీలకంగా పనిచేసిన డీఎస్పీ లింగయ్య,సీఐ శివ శంకర్, దామరగిద్ద ఎస్సై వసంతను ఎస్పీ అభినందించారు.