ఎలాంటి ఆధారాలు లేని నగదు పట్టివేత

by Disha Web Desk 15 |
ఎలాంటి ఆధారాలు లేని నగదు పట్టివేత
X

దిశ, వర్గల్ : ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న నగదును పోలీసులు సీజ్ చేశారు. గౌరారం ఎస్సై శివ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గౌరారం శివారులోని పాములపర్తి జంక్షన్ వద్ద పోలీసులు వాహనాల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాయపోల్ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తుల వాహనాల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా 2,19,100 రూపాయలు లభించాయి. దాంతో ఆ నగదును సీజ్ చేశారు. సీజ్ చేసిన నగదును కలెక్టర్ కార్యక్రమంలోని గ్రీవిన్స్ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై శివకుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తున్నప్పుడు వాటికి సంబంధించిన ఆధారాలు తప్పక ఉండాలని తెలిపారు.



Next Story

Most Viewed