Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే నలుగురు దుర్మరణం

by Shiva |
Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే నలుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన అనంతపురం జిల్లా(Ananthapur District)లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నార్పుల (Narpula)వైపు కారులో నలుగురు కలిసి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారు బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రేకులకుంట వద్దకు చేరుకోగానే ఎదురుగా అతివేగంగా వచ్చిన లారీ, కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు అనంతపురం జిల్లా (Ananthapur District) సిండికేట్ నగర్ (Syndicate Nagar) వాసులుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మృతుల కుటుంబాలకు సమాచారం అందజేశారు.

Next Story

Most Viewed