అక్రమంగా నిల్వ ఉంచిన కలప పట్టివేత

by Disha Web Desk 15 |
అక్రమంగా నిల్వ ఉంచిన కలప పట్టివేత
X

దిశ, కమ్మర్ పల్లి : కమ్మర్ పల్లి మండలం కోనాసముందర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను అటవీ శాఖ అధికారులు గురువారం పట్టుకున్నారు. కోనాసముందర్ గ్రామానికి చెందిన ఓ కార్పెంటర్ ఇంట్లో ఎటువంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన టేకు కలపను కమ్మర్ పల్లి రేంజ్ ఆఫీసర్ బి.రవీందర్ తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. టేకు కలపను, అదేవిధంగా కార్పెంటర్ కు సంబంధించిన మిషన్ ను సీజ్ చేసి కమ్మర్ పల్లి రేంజ్ ఆఫీస్ కు తరలించారు. పట్టుబడిన టేకు కలప విలువ సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు రాథోడ్, రాజు, లింగన్న, సునీత, సతీష్, నవీన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed