అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

by Disha Web Desk 23 |
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
X

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల శివారులోని ధరూర్ ఎస్సారెస్పీ కెనాల్ గేట్ల వద్ద సోమవారం రాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సంఘటన స్థలంలో రక్తపు మరకలు తో పాటు మృతదేహం పై అరటి పండ్ల ట్రాన్స్పోర్ట్ కు వినియోగించే ట్రేలు పెట్టి నిప్పు అంటించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. మృతుడు జగిత్యాల కృష్ణానగర్ కు చెందిన ముస్కు మహిపాల్ రెడ్డి (34) రెడ్డి గా గుర్తించారు. మహిపాల్ స్థానికంగా చికెన్ సెంటర్ లో పని చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే సంఘటన జరిగిన ప్రదేశం మల్యాల పరిధిలో ఉండటం తో మృతుడి భార్య జమున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్యాల పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed