- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆస్తికోసం సోదరిపై కత్తితో దాడి
దిశ, కంది : తన పెదనాన్న పేరు మీద ఉన్న భూమి తనకు రావాలనే కోపంతో వరుసకు అక్క అయిన మహిళను కత్తితో పొడిచి చంపేందుకు సోదరుడు యత్నించాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కందిలో ఈనెల 17న రాత్రి చోటుచేసుకుంది. సంగారెడ్డి రూరల్ ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కంది గ్రామానికి చెందిన పొట్టోళ్ల జయమ్మ (46) తన భర్త బాల్ రాజు చనిపోవడంతో ఆమె తల్లి వద్ద కంది గ్రామంలో ఉంటుంది. జయమ్మ తండ్రి వీరయ్య చాలా రోజుల క్రితం చనిపోయాడు. జయమ్మ తల్లి వృద్ధురాలు కావడంతో ఆమె యోగక్షేమాలు చూసుకుంటూ అక్కడే ఉంటుంది. జయమ్మ చినాన్న కొడుకు అయిన పొట్టోళ్ల రాజు (36)
తన పెదనాన్న పేరు మీద ఉన్న భూమిని జయమ్మ చూసుకుంటుందని గ్రహించి ఆ భూమిని దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. దాంతో జయమ్మతో గతంలో పలుమార్లు గొడవపడ్డాడు. ఆ గొడవలో రాజు పైన కోర్ట్ లో కేసు కూడా నడుస్తుంది. జయమ్మను చంపిస్తే ఆమె తండ్రి పేరు మీద ఉన్న భూమి మొత్తం తనకే వస్తుందని రాజు పథకం వేసుకొని ఈనెల 17న రాత్రి జయమ్మ ఇంటి వద్దకు వెళ్లి ఆమెతో గొడవపెట్టుకున్నాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె కడుపులో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గాయాలపాలైన జయమ్మను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన రాజుని గురువారం అరెస్టు చేశారు. కాగా జయమ్మ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.