HYD : విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు.. అంతలోనే యాక్సిడెంట్ కావడంతో..

by Disha Web Desk 4 |
HYD : విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు.. అంతలోనే యాక్సిడెంట్ కావడంతో..
X

దిశ, ఉప్పల్ : ఉప్పల్ నల్ల చెరువు కట్ట మైసమ్మ దగ్గర బస్ కింద పడి బీటెక్ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మేడిపల్లి సత్యనారాయణ పురంనకు చెందిన దొంతురి మధుసూదన్ రెడ్డి, సుష్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వర్షిత్ (23)ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు.ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో ద్విచక్ర వాహనం మీద ఇంటి దగ్గర నుంచి హిమాయత్ నగర్‌కు బ్యాంకు పని మీద వెళ్తుండగా ఉప్పల్ నల్లచెరువు కట్ట మైసమ్మ ఆలయం దగ్గర బైక్ స్కిడ్ అయి రోడ్డుమీద పడ్డాడు. అంతలోనే వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు తల మీద నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.



Next Story

Most Viewed