suicide : భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

by Sridhar Babu |
suicide : భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య
X

దిశ, హత్నూర : భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపానికి గురై భర్త మృతి చెందిన సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం హత్నూర మండలంలోని రెడ్డి ఖానాపూర్ గ్రామానికి చెందిన నర్సాపురం అశోక్ గౌడ్ (40) గత 16 సంవత్సరాల క్రితం స్వప్నతో వివాహం కాగా వారికి ఒక కుమారుడు, ఒక కూతురు సంతానం కలిగారు. అనంతరం భార్యతో తరచూ

గొడవలు జరగగా మృతుని భార్య స్వప్న గత ఆరు సంవత్సరాల క్రితం తన పిల్లలను ఆమె వెంట తీసుకొని తల్లిగారింటికి వెళ్లి అక్కడే ఉంటుంది. మృతుడు ఎన్నిసార్లు వెళ్లి నచ్చజెప్పి కాపురానికి రావాలని కోరినా స్వప్న రాకపోవడంతో అశోక్ గౌడ్ మానసికంగా బాధపడుతూ మనోవేధన భరించలేక రెండుసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అలాగే 18 వ తేదీన రాత్రి గ్రామ పరిధిలో గల పత్తికుంట వద్దకు చేరుకొని కుంటలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై సుభాష్ తెలిపారు.



Next Story