నీటిలో పడి బాలిక మృతి

by Disha Web Desk 23 |
నీటిలో పడి బాలిక మృతి
X

దిశ,వీణవంక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెందిన దేవరకొండ శ్రీనివాస్ అతని భార్య, కుమార్తెతో కలిసి వీణవంక మండలం గంగారం గ్రామ శివారులో బాతులు మేపుతుంటారు. శ్రీనివాస్ కుమార్తె పార్వతి(13) దప్పికతో దగ్గరలో గల వ్యవసాయ బావిలో మంచి నీళ్ళు తాగుటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగి చనిపోయింది. మృతురాలి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు.

Next Story

Most Viewed