పిడుగుపాటుతో పేలిన సెల్ ఫోన్.. వ్యక్తి మృతి

by Kalyani |
పిడుగుపాటుతో పేలిన సెల్ ఫోన్.. వ్యక్తి మృతి
X

దిశ, తెలకపల్లి: పిడుగు పడి సెల్ ఫోన్ పేలి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం రామ్ రెడ్డి పల్లి గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రాముడు (46) అనే రైతు రోజువారీ మాదిరిగానే పొలానికి వెళ్లి తన ఎద్దులను మేపుతుండగ ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. ఈ క్రమంలో రాముడు సమీపంలో పిడుగు పడడంతో అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ పేలి తీవ్రంగా గాయపడి అక్కడికి అక్కడే మరణించాడు. సమీపంలోని పొలాల్లో ఉన్న కొంతమంది గుర్తించి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై నరేష్ తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

Next Story

Most Viewed