BREAKING: హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లో పోలీసుల తనిఖీలు.. భారీగా డ్రగ్స్ స్వాధీనం, ముగ్గురి అరెస్ట్

by Disha Web Desk 1 |
BREAKING: హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లో పోలీసుల తనిఖీలు.. భారీగా డ్రగ్స్ స్వాధీనం, ముగ్గురి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు కాంగ్రెస్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మాదక ద్రవ్యాలతో రెడ్‌ హ్యాండెడ్‌గా ఎవరు పట్టుబడినా.. వారిని కఠినంగా శిక్షించాలంటూ పోలీసు శాఖకు ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్, ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేపడుతూ.. పెద్ద ఎత్తున గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు బుక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని గుడి మల్కాపూర్‌లో పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సాయంతో అదుపులోకి తీసుకున్నారు. అయితే, బెంగళూరుకు చెందిన ఓ నైజీరియన్ నుంచి నగరానికి చెందిన ముగ్గురు డ్రగ్స్ తీసుకొస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు నిందితుల నుంచి 7 గ్రాముల హెరాయిన్, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న గుడిమల్కాపూర్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Read More...

పరిశ్రమల్లో ప్రమాదాలు బాధాకరం

Next Story

Most Viewed