భవనం పైనుంచి పడి కార్మికుడి దుర్మరణం

by Sridhar Babu |
భవనం పైనుంచి పడి కార్మికుడి దుర్మరణం
X

దిశ, జూబ్లిహిల్స్ : నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కార్మికుడు పడి మృతి చెందిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... జీటీఎస్ కాలనీలో నిర్మిస్తున్న విద్యుత్ నియంత్రణ భవన్లో పనిచేస్తున్న మధ్య ప్రదేశ్​కు చెందిన కార్మికుడు ఉమాశంకర్(36) గురువారం 5వ అంతస్తు పైనుంచి కింద పడ్డారు. తీవ్రగాయాలు కావడంతో వెంటనే సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిర్మాణ బిల్డర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed