ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

by Sridhar Babu |
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి
X

దిశ, వర్గల్ : ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని చౌదర్ పల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… చౌదర్ పల్లి గ్రామానికి చెందిన బండి సాయిలు (65) ఈ నెల 4 వ తేదీ నుండి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు బంధువులను, తెలిసిన వారిని విచారించగా ఆచూకీ లభించలేదు. గ్రామంలో అన్ని చోట్ల వేతకగా కనిపించలేదు.

ఆదివారం సాయిలు మృతదేహం గ్రామంలోని బంధం చెరువులో నీటిపై తేలుతూ కనిపించడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందజేశారు. సాయిలు మానసిక స్థితి సరిగ్గా లేక చెరువు వద్ద కాలకృత్యాలు తీర్చుకుంటుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడని, తమ తండ్రి మరణం పట్ల ఎవరిపైన ఎలాంటి అనుమానాలు లేవని మృతుడి కుమారుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గౌరారం ఎస్సై శివకుమార్ తెలిపారు.

Advertisement

Next Story