- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీలో కొత్తగా 534 కరోనా కేసులు

దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 63,821మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 534 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,77,348కి చేరింది. ఇద్దరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 7,069గా ఉంది. ప్రస్తుతం 4,454 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,65,825మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 498మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,10,65,297మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.
అనంతపురం జిల్లాలో 16కరోనా కేసులు నమోదు కాగా చిత్తూరులో 130, తూర్పుగోదావరిలో 45, గుంటూరులో 54, కడపలో 27, కృష్ణాలో 74, కర్నూలులో 13, నెల్లూరులో 21, ప్రకాశంలో 19, శ్రీకాకుళంలో 39, విశాఖపట్నంలో 31, విజయనగరంలో 14, పశ్చిమగోదావరిలో 51 కేసులు వచ్చాయి. కరోనా మహమ్మారి బారిన పడి అనంతపురం జిల్లాలో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.