ఏప్రిల్-27: నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?

by Disha Web Desk 6 |
ఏప్రిల్-27: నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?
X

దిశ, ఫీచర్స్: బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ పసిడి ప్రియులను టెన్షన్ పెడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ధరలు పెరుగుతుండటంతో దాని పేరు చెప్పినా భయపడిపోతున్నారు.

ఇక నిన్నటి ధరలతో పోల్చుకుంటే.. తాజాగా నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం పై రూ. 200 పెరగడంతో.. రూ. 66, 850గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ.220పెరగ్గా.. రూ. 72, 930కి విక్రయిస్తున్నారు. ఇక కిలో వెండిపై రూ. 500 తగ్గడంతో రూ.87,500గా ఉంది. అయితే నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- 66,850

24 క్యారెట్ల బంగారం ధర- రూ.72, 930

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- 66,850

24 క్యారెట్ల బంగారం ధర- రూ.72, 930



Next Story

Most Viewed