- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పైకి శ్రీరామ్... లోలోపల రిజర్వేషన్లకు రామ్ రామ్
దిశ, హుస్నాబాద్ : పైకి శ్రీరామ్.. లోలోపల రిజర్వేషన్లకు రామ్ రామ్ చెబుతూ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తివేయాలని చూస్తున్న మోడీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం తిరుమల గార్డెన్ లో జరిగిన సీపీఐ హుస్నాబాద్ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి పాల్గొనగా జిల్లా కార్యదర్శి మంద పవన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని మళ్లీ గెలిచి
రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తివేయాలని చూస్తున్న బీజేపీని ఓడించాలని కోరారు. నిన్న వేములవాడకు వచ్చిన మోడీ ఆలయ అభివృద్ధికి కోటి రూపాయలు కాదు కదా ఒక కోడె కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలైనా అధిష్టానం ఇచ్చిన బాధ్యతలు విస్తృత పర్యటనల దృశ్య సమయం కేటాయించలేకపోతున్నానని, దీంతో సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య బేధాభిప్రాయాలు వస్తున్నాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో హుస్నాబాద్ ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్ది ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు గర్వంగా చెప్పుకునే విధంగా ఈ నియోజకవర్గ పేరును నిలబెడతానని హామీ ఇచ్చారు.