కుక్కలకు ఆహారంగా మారిన మృతదేహం

by Sumithra |
కుక్కలకు ఆహారంగా మారిన మృతదేహం
X

దిశ, వెబ్‌డెస్క్ : గుర్తు తెలియని మృతదేహాన్ని కుక్కులు పీక్కుతిన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్లలో ఈ ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగుచూసింది. గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని మరణించాడు. మృతదేహాన్ని ఎవరూ గమనించకపోవడంతో కుక్కలు పీక్కుతిన్నాయి.

రైల్వే ట్రాక్స్ దగ్గర కుక్కలు అధిక సంఖ్యలో గుమ్మిగూడటాన్ని గమనించిన స్థానికులు దగ్గరికి వెళ్లి పరిశీలించగా డెడ్ బాడీ కనిపించింది. గుర్తుపట్టని విధంగా మృతదేహం మారిపోయిందని తెలుస్తోంది. దీంతో స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed