- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రెండు రోజులు వైన్స్, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు బంద్..
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో నెల 8న పరిషత్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటించింది. పోలింగ్ రోజు(8వ తేదీ)తో పాటు, 7వ తేదీన కూడా సెలవురోజుగా ప్రకటిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. 7వ తేదీన ఎన్నికల ఏర్పాట్ల నిమిత్తం సెలవు ఇస్తున్నట్టు వెల్లడించింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండ్రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, వాణిజ్య సంస్థలకు సెలవు ఉంటుందని తెలిపింది. కాగా, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రెండు రోజులు ముందుగానే మద్యం షాపులు మూతపడనున్నాయి.
Next Story