శ్రావణిని.. ఆ ముగ్గురు‌ పెళ్లి చేసుకుంటామన్నారు !

by  |
శ్రావణిని.. ఆ ముగ్గురు‌ పెళ్లి చేసుకుంటామన్నారు !
X

దిశ, వెబ్‌డెస్క్: సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులు దేవరాజ్‌రెడ్డి, సాయి కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినట్లు వెస్జ్‌జోన్ డీసీపీ ఏఆర్. శ్రీనివాస్‌ వెల్లడించారు. సోమవారం ఇద్దరు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ముగ్గురిని నిందితులుగా గుర్తించామని అశోక్‌రెడ్డిని త్వరలోనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తామని డీసీపీ పేర్కొన్నారు. శ్రావణి తల్లిదండ్రులను నిందితులుగా చేర్చడం కుదరదని స్పష్టం చేశారు. శ్రావణిని దేవరాజ్‌, సాయికృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి ఏదో ఒక సందర్భంలో పెళ్లి చేసుకుంటామని చెప్పి, ఆ తర్వాత పలు విధాలుగా వేధించడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నామని తెలిపారు.

తనను దేవరాజ్‌రెడ్డి వెంటాడి వేధిస్తున్నాడని గతంలో శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసిందని, చనిపోవడానికి ముందు కూడా దేవరాజ్‌ ఆమెతో చాలాసేపు మాట్లాడాడన్నారు. యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి దేవరాజ్ మోసం చేశాడని అన్నారు. అరెస్ట్ అయిన దేవరాజ్‌, సాయికృష్ణారెడ్డికి కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది.

Read Also…

అమెరికాలో తెలుగు యువతి మృతి..!


Next Story

Most Viewed