అమెరికాలో తెలుగు యువతి మృతి..!

by  |
అమెరికాలో తెలుగు యువతి మృతి..!
X

దిశ, వెబ్‎డెస్క్:అమెరికాలోని ఓ జలపాతం వద్ద తెలుగు యువతి మృతి చెందింది. సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ జారి పడి మృతి చెందింది.

వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కూతురు కమల ఇంజనీరింగ్ పూర్తి చేసి పై చదువుల నిమిత్తం అమెరికా వెళ్లింది. అక్కడే ఎంఎస్ పూర్తి చేసిన కమల.. కొలంబియాలో ఉంటూ ఉద్యోగం చేస్తుంది. కొద్దిరోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లిన కమల శనివారం ఇంటికి తిరిగొస్తూ అట్లాంటా సమీపంలోని జలపాతం వద్ద ఆగారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడి మృతి చెందింది. నాట్స్ సహకారంతో ఆమె మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కూతురు మరణవార్త తెలుసుకున్న లక్ష్మణరావు, అరుణ దంపతులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


Next Story