- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వరాహానికి అమ్మ అయిన శునకం!

X
దిశ, వెబ్డెస్క్ : కులం, వర్గం అంటూ మనిషికి మనిషే శత్రువుగా మారి కత్తులు దూసుకుంటున్న ఈ రోజుల్లో జాతి వైరం మరిచి ఓ జీవి కడుపు నింపింది మరో మూగజీవి. ఆకలిగొన్న వరాహం (పంది) పిల్లకు ఓ శునకం పాలిచ్చి ఆకలి తీర్చుతోంది. ఇలా ఏ ఒక్కరోజో కాదు.. పది రోజులుగా ఆ శునకం.. వరాహాలు ఉండే ప్రాంతానికి వెళ్లి వాటి కడుపు నింపుతుండడం గమనార్హం. వికారాబాద్ జిల్లా యాలాల్ మండల కేంద్రంలో జరుగుతున్న ఈ ఘటనను చూసిన ప్రజలు శునకం ఔదర్యాన్ని కొనియాడుతున్నారు. జాతులు కాదు.. మానవత్వమే ముఖ్యమని చాటిచెబుతోందీ ఘటన అని పేర్కొంటున్నారు.
Next Story