ఇట్స్ అఫీషియల్.. రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ

by Hamsa |
ఇట్స్ అఫీషియల్.. రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ, నందిత దాస్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘జ్విగాటో’. అయితే దీనిని అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించగా.. షహానా గోస్వామి హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అయితే ఈ మూవీ 2022లో థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వచ్చిన జ్విగాటో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. అంతేకాకుండా పలువురు ప్రశంసలు అందుకోవడంతో పాటు అవార్డులు వేదికలపై ప్రదర్శించారు.

అయితే ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. కానీ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు మాత్రం నోచుకోలేదు. తాజాగా, రెండేళ్ల తర్వాత ‘జ్విగాటో’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. అయితే జ్విగాటో అక్టోబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుందని అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

Advertisement

Next Story

Most Viewed