నాగార్జున సాగర్ కట్ట మీదకు పోవడానికి ఉత్తమ్, కోమటిరెడ్డి ఎందుకు భయపడుతున్నారు?

by Disha Web Desk 9 |
నాగార్జున సాగర్ కట్ట మీదకు పోవడానికి ఉత్తమ్, కోమటిరెడ్డి ఎందుకు భయపడుతున్నారు?
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ కట్ట మీదకి పోవడానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో మాకు కావాల్సినప్పుడు వెళ్లి నాగార్జున సాగర్ గేట్లు తెరిచే వాళ్లమని అన్నారు. ఇప్పుడు కేఆర్ఎంబీకి అప్పగించారు కాబట్టి మంత్రులు వెళ్ళడానికి భయపడుతున్నారని వెల్లడించారు. నాగార్జున సాగర్ నుంచి ఏపీ నీళ్లు తీసుకుపోతుంటే మొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళకి వెళ్లాల్సిన వాటా వాళ్ళు తీసుకెళ్తున్నారు తెలిపారు. కానీ నేడు ప్రభుత్వ సెక్రటరీ ఏపీకి మీరు నీళ్లు తీసుకెళ్లటం సరైనది కాదు అని లేఖ రాశాడు అంటూ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు.

Read More...

RS ప్రవీణ్ కుమార్‌పై KTR ప్రశంసల వర్షం.. ధీరుడు, వీరుడు అంటూ పొగడ్తలు



Next Story

Most Viewed