టీటీడీకి నాణ్యమైన నెయ్యి సరఫరా చేస్తాం : తెలంగాణ విజయ డెయిరీ ప్రకటన

by M.Rajitha |
టీటీడీకి నాణ్యమైన నెయ్యి సరఫరా చేస్తాం : తెలంగాణ విజయ డెయిరీ ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) లడ్డూ ప్రసాదంలో వాడిన కల్తీ నెయ్యి గురించి తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. అయితే టీటీడీ కోసం తాము నాణ్యమైన, స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ(Telangana) ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ(Vijaya Dairy) పేర్కొంది. ఈ మేరకు టీటీడీ ఈవో జె. శ్యామలరావుకు లేఖ రాసింది. 'దేశవ్యాప్తంగా నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తుల్లో తెలంగాణ విజయ డెయిరీ ప్రసిద్ధి గాంచింది. టీటీడీకి అత్యంత నాణ్యమైన నెయ్యి, పాల ఉత్పత్తులను అందించేందుకు విజయ డెయిరీ సిద్ధంగా ఉంది. నాణ్యత, ధర విషయంలో పూర్తి పారదర్శకత వహిస్తున్న మా సంస్థకు.. ఆ భగవంతునికి, టీటీడీకి, భక్తులకు సేవ చేసే అవకాశాన్ని కల్పించండి. ఇది కేవలం మా సంస్థకే కాదు.. లక్షలాది పాడి రైతుల జీవనోపాధికి కూడా మీరు తోడ్పడినట్టు అవుతుంది' అని లేఖలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed