- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ..హస్తం గూటికి చేరిన ముఖ్యనాయకులు
దిశ,కొడిమ్యాల: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల వేళ గులాబీ పార్టీకి కొడిమ్యాలలో భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్తో సన్నిహిత సంబంధం ఉన్న పలువురు ముఖ్య నాయకులు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఎంపీపీ మేనేని స్వర్ణలత, సింగిల్ విండో చైర్మన్ రాజు నర్సింగరావుతో సహా వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు తాజా మాజీ సర్పంచ్ నాయకులు పెద్ద ఎత్తున శుక్రవారం రోజున స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ లో కష్ట పడ్డ కార్యకర్తలకు విలువ లేదని పార్టీ లోకి కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇస్తూ కష్టపడి పని చేసిన వారిని నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మకంతో పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభమైందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చెందడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నారాయణ గౌడ్ ,జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.