హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత

by Disha Web Desk 12 |
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత
X

దిశ, శేరిలింగంపల్లి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ( హెచ్ సీయూ) లో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు ఏబీవీపీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వివాదం చెలరేగినట్లు తెలుస్తుంది. మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు పాటలు పాడుతుంటే అడ్డుకున్న ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి నాయకుడు ఫైజల్ పై ఏబీవీపీ విద్యార్థులు దాడికి దిగారని, ఈ సంఘటనకు సంబంధించి ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగగా ఇరువర్గాల నాయకులు ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకున్నారు. దీంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులు చందానగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు సర్ది చెప్పినట్లు తెలుస్తుంది.

Next Story

Most Viewed