నాయకులు చెప్పేది గొప్పలు.. గ్రామాల ప్రజలకు తిప్పలు

by Aamani |
నాయకులు చెప్పేది గొప్పలు.. గ్రామాల ప్రజలకు తిప్పలు
X

దిశ,షాబాద్ : షాబాద్ మండలంలోని గ్రామాల రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది. బస్సు సౌకర్యం లేక రోడ్డు సౌకర్యం బాగ లేక రాజకీయ నాయకులను దుమ్మెత్తి పోస్తున్న మన్మర్రి, బోడంపహాడ్, అప్పారెడ్డి గూడ గ్రామాల ప్రజలు షాబాద్ మండలం అభివృద్ధిలో ప్రపంచం గుర్తించే స్థాయిలో ఉన్నది అని గొప్పలు చెప్పుకునే నాయకులు,షాబాద్ మండలం లోని రోడ్ ల పరిస్థితిని గుర్తించలేక పోతున్నారు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతారం నుంచి బోడంపహాడ్, మన్మర్రి, అప్పారెడ్డి గూడ గ్రామాల వరకు వున్న రోడ్డు మార్గంలో 965 గుంతలు, నరకానికి దారిలా ఉంది. ఈ గుంతల రోడ్డు ఆపదలో ఊరి నుంచి బయటకు పోవాలంటే 1 గంట సమయం పడుతుంది. ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం వస్తారు, మళ్ళీ మా గ్రామాల పరిస్థితి పట్టించుకోరు అని మూడు గ్రామాల ప్రజలు రాజకీయ నాయకులను దుమ్మెత్తిపోస్తున్నారు. అటు బస్సు సౌకర్యం లేక ఇటు రోడ్ బాగాలేక ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నారు ఈ గ్రామాల ప్రజలు.

Advertisement

Next Story